DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల కదలికలపై నిఘా పెంచేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్ డివిజన్ల పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కర్నూలు నగరంలో కర్నూలు వన్టౌన్ సీఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో బ్లూ కోల్ట్స్, క్యూఆర్టీ పోలీసు బృందాలు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టడంతో పాటు రహదారి ప్రమాదాల నివారణ కోసం “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాత్రివేళల్లో వాహనదారులు అలసటకు గురికాకుండా అప్రమత్తంగా ప్రయాణించేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Admin
DNB News