DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా...మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు నీటిలో గల్లంతు కావడంతో విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం మేరకు, హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర (5), సతీష్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22)లు బంధువుల ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి పూజకు హాజరయ్యారు. పూజ కార్యక్రమం ముగిసిన అనంతరం సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో చిక్కుకుని గల్లంతైనట్లు తెలుస్తోంది. నదిలో నీటి లోతును అంచనా వేయలేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక మత్స్యకారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం నిరంతరంగా శోధన కొనసాగుతోంది. ఈ ఘటనతో మంత్రాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Admin
DNB News