DNB News - ఆంధ్రప్రదేశ్ / : కోదాడ:పట్టణపరిధిలోని బాబు నగర్, రాజీవ్ నగర్, బాలాజీనగర్, లోని గల ఉన్నటువంటి 8వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి రాయల సునీత సతీష్, గెలుపును కాంక్షిస్తూ పట్టణ అధ్యక్షుడు కుడుముల ప్రశాంత్ సోమవారంఅవార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను రాయల సునీత కు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డులలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేమమే విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి రాయల సునీత సతీష్,లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టణం, వార్డు అభివృద్ధి జనసేన పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సారథులు నాయకులు ములుగురు విగ్నేష్, తోట సాయి గణేష్ గణేష్ కిరణ్ తోట కోటి నరసింహారావు నాగేశ్వరరావు వెంకటేష్ కోటి సాయి దేవులపల్లి హనుమంతరావు, ప్రశాంత్, అంజి బాబు, అంజి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News