DNB News - ఆంధ్రప్రదేశ్ / : జగన్నాధపురం లో బడిబాట ర్యాలీ కార్యక్రమం ఓ ఆర్ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. మండలం పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలులో భాగంగా మంగళవారము నాడు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమమును నిర్వహించినారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వం పిల్లలకి అందిస్తున్న నాణ్యమైనవిద్య ,ఉచిత పాఠ్యపుస్తకములు, నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనం, క్రీడా పరికరాలు, బోధనోపకరణముల ద్వారా నైపుణ్యమైన బోధన, తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, మనబడి కల్పిస్తుందని, నైపుణ్యమైన ఉపాధ్యాయుల ద్వారా బోధన కొనసాగుతుందని, ఇంగ్లీష్ మీడియం కు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యనభ్యసించడం వలన ఉన్నత విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా సంఘసంస్కర్తలుగా, రాజకీయ నాయకులుగా, సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన పౌరులుగా తయారవుతారని, ఎదుగుతారని, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై, ప్రజాప్రతినిధులకు యువజనులకు, మహిళా సంఘాల ప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరిపై ఉందని, వచ్చే విద్యా సంవత్సరానికల్లా మన ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకుందామని, విద్యార్థుల నమోదును పెంచుతామని బడి ఈడు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దామని, ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంఎం. సతీష్ కుమార్ డి. విజయ విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
DNB News