DNB News - ఆంధ్రప్రదేశ్ / : పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, రవాణా మరియు భద్రతా ఏర్పాట్లు సమర్థంగా ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలకు హాజరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News