Monday, 15 June 2026 01:48:18 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆదోనిలో ద్వేష ప్రసంగంపై ఆగ్రహం – బాధ్యులపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజకీయ, సామాజిక నేతల డిమాండ్..

Date : 23 February 2026 07:05 PM Views : 162

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఈ నెల 19న శక్తి గుడి గ్రౌండ్‌లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో జరిగిన ద్వేషపూరిత ప్రసంగంపై వివిధ రాజకీయ మరియు సామాజిక నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఒక వ్యక్తి చేసిన ప్రసంగంపై తక్షణ విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు SDPI నాయకులు సద్దాం హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఫరూక్, టిడిపి నాయకులు ఇక్బాల్, వైకాపా నాయకులు అబుబకర్ యాసిన్, ప్రజా సంఘాల నాయకులు ఖాదర్ నిస్సార్ తెలిపారు. సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు సంబంధిత పోలీస్ అధికారులు ఎటువంటి స్పష్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితికి దారితీసిందని వారు పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం, బాధ్యులపై చర్యలు ప్రారంభించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రసంగం మతాల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు సృష్టించేలా ఉందని పేర్కొంటూ, చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించాలని వారు కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :