DNB News - ఆంధ్రప్రదేశ్ / : వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజుల కేటాయింపు పట్ల హర్షాతిరేకాలూ నారా లోకేష్ చారిత్రాత్మక నిర్ణయం వడ్డేరల జీవితాల్లో వెలుగులు నింపింది. వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజుల కేటాయింపుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల వడ్డేర సామాజిక వర్గం అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వడ్డేరల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయి. మాట తప్పని నేత, హామీ నిలబెట్టుకున్న లోకేష్: యువనేత లోకేష్ తమ పాదయాత్రలో వడ్డేరలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, మాట తప్పని నేతగా నిలిచారు. ఇచ్చిన హామీ ప్రకారం వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజులను కేటాయించడంలో చొరవ చూపిన లోకేష్ కూటమి ప్రభుత్వ పెద్దలకు మా సామాజిక వర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చారిత్రాత్మక నిర్ణయం, ఆర్థికాభివృద్ధికి బాటలు: వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజులు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయంతో వడ్డేర సామాజిక వర్గం ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఎదగడానికి అవకాశం ఉంది. వడ్డేరల చిరకాల వాంఛను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ మరియు కూటమి ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు. సామాజిక వర్గానికి దక్కిన గౌరవం: "వడ్డేరల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతం. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మైనింగ్ లీజులను కేటాయించడం మా సామాజిక వర్గానికి దక్కిన గౌరవం," అని వడ్డే వెంకట్ (ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ చైర్మన్ & టిడిపి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్) అన్నారు.
Admin
DNB News