DNB News - ఆంధ్రప్రదేశ్ / : * బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపెతంగా జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ . * ముఖ్య అతిథిలుగా పాల్గొన్న జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జనసేనపార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు , శ్రీకాకుళం నియోజవర్గం, గార మండలం, బందరువానిపేట గ్రామంలో బుధవారం జనసేనపార్టీ నాయకులు బడే శ్రీరామ్ మరియు స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ అత్యంత ఘనంగా నిర్వహించారు,ఈ నేపథ్యంలో జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ NDA కూటమి ఏర్పాటుకు జనసేనపార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోశం ఆయన చేసిన త్యాగం మరువులేనిదని అన్నారు, గ్రామస్థాయి నుంచి కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేద్దామని భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శిచిట్టి భాస్కర్, సనియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణ,మండలాల ముఖ్య నాయకులు శ్రీకాకుళం రూరల్ మండలపార్టీ అధ్యక్షులు తాటిరాజుల కూర్మారావు, గుమ్మడి శాంతారావు,కింతాడ.సంతోష్ కుమార్, అంబటి రామకృష్ణ, పెదపాడు శంకర యాదవ్, నిమ్మాడ. వెంకటేశ్వరరావు, ఊట.మల్లేశ్వరరావు(మధు),స్థానిక బందరువానిపేట జనసేనపార్టీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నాయకులు , జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News