DNB News - ఆంధ్రప్రదేశ్ / : YSRCP హయాంలో సర్పంచ్ లుగా ఐదు సంవత్సరములు పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్బంగా నేడు శ్రీకాకుళం నియోజకవర్గం లో, నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మాన ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ లకు జరిగిన సన్మాన సభలో అందరికీ తన ఫోటోల ను ధర్మాన. ప్రసాద్ పంపిణీ చేశారు, అయితే విచిత్రం ఏంటంటే, శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచిన YSRCP సర్పంచ్ లకు అందజేసిన ఫోటోలలో మచ్చుకైనా ఆ మహానుభావుడు శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వెయ్యలేదు.. ఇదీ ధర్మాన కు పార్టీ ఆదినాయకుని పై ఉన్న చిత్తశుద్ధి.. సర్పంచ్ ల గెలుపుకూ, చివరికి ధర్మాన గెలుపుకు, తన రెవిన్యూ మంత్రి హోదా కు "జగనన్న" కారణమన్నది అంతలోనే మరచిపోయారా... మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి తీరాల్సిందేనన్న కనీస భాద్యత లేనప్పుడు జిల్లా భాద్యతలు నాకివ్వండి అని అధిష్టానానికి అడగటం ఎంతవరకూ ధర్మం... అయినా "జగనన్న" లేని ఆ ఫోటో కు విలువెక్కడ ఉంటుంది...ఇంతకీ జగన్మ్మోహన్ రెడ్డి గారి ఫోటో వెయ్య లేదంటే ఇంకేమయినా ఆలోచన ఉందంటారా...చూద్దాం గెలుపు ధర్మానిదా.. అధర్మానిదా...
Admin
DNB News