Thursday, 16 April 2026 05:04:41 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

షాహీ జామియా మస్జిద్ ఆస్తులపై అక్రమాలపై విచారణ కోరుతూ సబ్-కలెక్టర్‌కు వినతి..

Date : 15 April 2026 10:53 AM Views : 47

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని షాహీ జామియా మస్జిద్ ఆస్తులు, ఆదాయం మరియు నిర్వహణలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ బీజేపీ మైనారిటీ నాయకులు సబ్-కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదోనికి చెందిన బి. జాఫర్ మాట్లాడుతూ, సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన షాహీ జామియా మస్జిద్‌కు దాదాపు ₹1000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ, వాటి నిర్వహణలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మస్జిద్ ఆస్తులు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండటం, వాటిలో కొంత భాగం బంధువుల పేర్లకు మార్చబడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఆస్తుల వివరాలు, ఆదాయం-వ్యయాల సమాచారం ప్రజలకు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మస్జిద్‌కు వచ్చే ఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, అధికారిక రశీదుల్లో తక్కువ మొత్తమే చూపిస్తూ మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు జరగాల్సిన కమిటీ ఎన్నికలను ఆలస్యం చేస్తూ అదే వ్యక్తి పదవిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రజల డిమాండ్లు: మస్జిద్ ఆస్తుల పూర్తి వివరాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలి అక్రమంగా బదిలీ చేసిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి మస్జిద్ ఆదాయాన్ని ప్రతి నెల ప్రజలకు తెలియజేయడానికి డిస్‌ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలి కనీసం 10 మంది సభ్యులతో రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి మస్జిద్ కమిటీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మస్జిద్ పవిత్రతను కాపాడాలని వారు అధికారులను కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :