DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జనగణమన గీతం ఆలపిస్తూ జెండాకు వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశ దేశాలు తిరిగి రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు. అటువంటి మహానుభావుల అడుగుజాడల్లో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను విస్మరిస్తూ అరాచక పాలన సాగిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలపై దౌర్జన్యాలు, కబ్జాలు, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని, రాష్ట్రంలో అరాచక శక్తులను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు శ్రీ బి. దేవా శ్రీలక్ష్మి తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News