Tuesday, 14 April 2026 07:32:00 AM
# ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై చర్యలు తీసుకోవాలి – ఏఐఎస్ఎఫ్ డిమాండ్. # ప్రతి ఒక్కరు విధిగా రహదారి నిబంధనలు పాటించాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ. # రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక... # ఆదోనిలో అత్యాధునిక కామత్ డెంటల్ వైద్యశాల ప్రారంభం – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి.. # హైందవ ధర్మ ప్రచారం కోసం కృషి చేయాలి – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి. # చిత్తూరు జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు # అనంతపురం జిల్లా గ్రంథాలయంలో పూలే జయంతి వేడుకలు # అన్నమయ్యా జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబరాలు # ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను ఘనంగా నిర్వహిద్దాం – జేఏసీ పిలుపు... # స్వచ్ఛతకు తొలి ప్రాధాన్యత – ఇంటింటి చెత్త సేకరణకు 20 వాహనాల ప్రారంభం... # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ # ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం # సమానత్వ జ్యోతి వెలిగించిన మహానేత జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా # అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు # ఆస్పరి దాహార్తి ఎప్పుడు తీరుతుంది? # మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తాం -- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి... # మహాత్మ జ్యోతిరావు పూలె కు ఘన నివాళులు # వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి # రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించాలి...సిలిండర్లతో సిపిఎం నిరసన..

Date : 09 March 2026 06:10 PM Views : 52

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సామాన్య ప్రజలపై పెరిగిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సర్కిల్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, సీనియర్ నాయకులు ఈరన్న పాల్గొని మాట్లాడారు. అమెరికా ప్రోత్సాహంతో జరుగుతున్న యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగి ప్రజలపై భారంగా మారాయని వారు పేర్కొన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులను ఖండించాలని భారత ప్రభుత్వం గట్టిగా స్పందించాలని కోరారు. యుద్ధాల వల్ల అమాయక ప్రజలు, చిన్నపిల్లలు, పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస ప్రాంతాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ ధర రూ.60, కమర్షియల్ గ్యాస్ ధర రూ.114 పెరగడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరాన్‌తో ఉన్న భారతదేశ ఆర్థిక, వాణిజ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సరైన వైఖరితో వ్యవహరించాలని సూచించారు. ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు గ్యాస్ ధరలను తగ్గించడమే కాకుండా యుద్ధాలకు వ్యతిరేకంగా భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్నతో పాటు నాయకులు గోపాల్, తిప్పన్న, పాండు, వీరేష్, వెంకటేశులు, ముని, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :