DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామి కు సోమవారం మంత్రాలయంలో నాయకులు, మఠం పెద్దలు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని మంత్రి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గురు వైభవోత్సవాల సందర్భంగా ఆదివారం మంత్రాలయానికి విచ్చేసిన ఆయన ఉత్సవాలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆదివారం రాత్రి మంత్రాలయంలో బస చేసిన మంత్రి, సోమవారం గురు వైభవోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థ స్వామి శేషవస్త్రం కప్పి ఫలమంత్రాక్షతలు, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. శ్రీమఠంలో జరిగిన కార్యక్రమాలు భక్తి భావనతో కొనసాగాయి. మంత్రాలయ పుణ్యక్షేత్ర మహిమను మంత్రి కొనియాడుతూ, దేశ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అనంతరం హెలిప్యాడ్కు చేరుకున్న మంత్రిని అధికారులు, ప్రజాప్రతినిధులు, మఠం పెద్దలు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, తహసీల్దార్ రమాదేవి, మఠం పెద్దలు, నాయకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News