Saturday, 18 April 2026 02:06:56 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

మంత్రాలయంలో కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు..

Date : 23 February 2026 05:56 PM Views : 85

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామి కు సోమవారం మంత్రాలయంలో నాయకులు, మఠం పెద్దలు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని మంత్రి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గురు వైభవోత్సవాల సందర్భంగా ఆదివారం మంత్రాలయానికి విచ్చేసిన ఆయన ఉత్సవాలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆదివారం రాత్రి మంత్రాలయంలో బస చేసిన మంత్రి, సోమవారం గురు వైభవోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థ స్వామి శేషవస్త్రం కప్పి ఫలమంత్రాక్షతలు, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. శ్రీమఠంలో జరిగిన కార్యక్రమాలు భక్తి భావనతో కొనసాగాయి. మంత్రాలయ పుణ్యక్షేత్ర మహిమను మంత్రి కొనియాడుతూ, దేశ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకున్న మంత్రిని అధికారులు, ప్రజాప్రతినిధులు, మఠం పెద్దలు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, తహసీల్దార్ రమాదేవి, మఠం పెద్దలు, నాయకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :