DNB News - ఆంధ్రప్రదేశ్ / : కపటి గ్రామానికి చెందిన ముద్దాయి వేణుగోపాల్ (35), తండ్రి శంకరప్ప గౌడ్ను చాగి బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, 18.02.2026 రాత్రి ఆస్తి పంచివ్వలేదనే కారణంతో, ముద్దాయి తన తండ్రి శంకరప్ప గౌడ్పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుగా వచ్చిన తన తల్లిపై కూడా దాడి చేశాడు. అనంతరం తండ్రి మెడలో ఉన్న బంగారు గొలుసు, బుల్లెట్ మోటార్ సైకిల్, సెల్ ఫోన్ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తరువాత తండ్రి సెల్ ఫోన్ ద్వారా ఫోన్ పే యాప్ ఉపయోగించి సుమారు రూ.2 లక్షలను తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఈరోజు ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుండి బంగారు గొలుసు, రూ.1,92,000 నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్కు తరలించారు.
Admin
DNB News