Wednesday, 17 June 2026 03:14:05 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం

Date : 17 April 2026 06:07 PM Views : 45

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయలసీమ సాగునీటి హక్కుల సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన, అనంతవెంకట రామిరెడ్డి మరియు సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల మేరకు జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి మరియు సాగునీటి హక్కుల విషయంలో గత ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా, 9 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాలను ఇతర రాష్ట్రాలు వినియోగించుకుంటున్న సమయంలో, వైఎస్ జగన్ హయాంలో సీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి సీమ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అలాగే, కర్నూలు జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హెచ్చరించారు. సీమకు రావాల్సిన నీటి హక్కుల కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నేషనల్ లా యూనివర్సిటీని తిరిగి రాయలసీమకు తీసుకురావాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి చైతన్యం పెంచుతూ, సీమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత బలపర్చాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధి, సాగునీటి హక్కుల సాధనలో వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :