DNB News - ఆంధ్రప్రదేశ్ / : తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ అమ్మవారి దేవాలయం మరియు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం దర్శనం నిమిత్తం కర్నూలుకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి కి కర్నూలు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంత్రి ని పుష్పగుచ్ఛంతో ఆహ్వానించి, జిల్లా పరిపాలన తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి ఆలయ దర్శనాల అనంతరం సంబంధిత కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Admin
DNB News