Saturday, 18 April 2026 06:00:19 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

అధిక శబ్దం చేసే 100 బైక్ సైలెన్సర్లు, 500 ఆటో హారన్‌లు రోడ్ రోలర్‌తో ధ్వంసం..

Date : 21 February 2026 04:22 PM Views : 126

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అధిక శబ్దం కలిగించే బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్‌లపై కఠిన చర్యలు తీసుకుంటూ కర్నూలు పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో సీజ్ చేసిన 100 బైక్ సైలెన్సర్లు, 500 ఆటో హారన్‌లను శనివారం జిల్లా పోలీసు కార్యాలయం, కొండారెడ్డి బురుజు సమీపంలో రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు కర్నూలు పట్టణంలో కొంతమంది యువకులు తమ ద్విచక్ర వాహనాలకు మాడిఫై చేసిన సైలెన్సర్లు అమర్చుకుని అధిక శబ్దంతో వాహనాలు నడుపుతున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యం పెరిగి వృద్ధులు, చిన్నారులు, రోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించారు. దీంతో ఒక నెల రోజుల పాటు కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు, కర్నూలు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఈ సైలెన్సర్లు, హారన్‌లను సీజ్ చేశారు. అనంతరం చట్టప్రకారం వాటిని రోడ్ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మోడిఫై చేసిన సైలెన్సర్లు, అధిక శబ్దం చేసే హారన్‌లు అమర్చినట్లయితే జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి వాహనదారుడు వ్యక్తిగత భద్రతతో పాటు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలో సామాజిక బాధ్యత కలిగిన పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు ట్రాఫిక్ పోలీసులకు సహకారం అందిస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల క్రింద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు దాతలు సహకారం అందించారు. ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ ఎల్‌ఈడి డిస్‌ప్లే బోర్డు, 66 సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్, 4 ఆధునాతన మూవబుల్ బారికేడ్స్‌ను దాతలు అందజేశారు. రద్దీ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో రోడ్డు స్పష్టంగా కనిపించేలా సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్‌ను త్వరలో మరింత సంఖ్యలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీ జె.బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :