DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగి రమేష్ను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు.కూటమి ప్రభుత్వ ప్రతీకార చర్యల వల్ల జోగి రమేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులు పడిన ఆవేదనను, ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా తమ్మినేని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే హక్కు తమకు ఉందని, కానీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అనవసర రాద్ధాంతం చేసి ప్రభుత్వం అబాసుపాలైందని, అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను జోగి రమేష్ సమర్థవంతంగా ఎండగట్టారని గుర్తు చేశారు. ఈ కారణంతోనే ఆయనను టార్గెట్ చేస్తూ 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడితే కూటమి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, జోగి రమేష్ కుటుంబానికి వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ అండగా ఉంటాయని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుంపల రామారావు సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి రాష్ట్రా ఇంటలెక్చువల్ కార్యదర్శి పిల్లల రామకృష్ణ కొత్తూరు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గున్నారు
Admin
DNB News