DNB News - ఆంధ్రప్రదేశ్ / : విశ్వహిందూ పరిషత్ (VHP) దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి, వారి ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ హైందవ ధర్మ ప్రచారం చేయాలని సూచించారు. హైందవ ధర్మం నిత్యనూతనమైనది, సత్య సనాతనమైనదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రాంతవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులతో ఎమ్మెల్యే పరిచయం చేసుకుని, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ చర్చించారు. ఈ కార్యక్రమంలో VHP జాతీయ, ప్రాంత స్థాయి నాయకులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర, జిల్లా నాయకులు తూముకుంట ప్రతాపరెడ్డి, ప్రాణేష్, బసవన్న గౌడ్, హనుమంత్ రెడ్డి, వీరన్న రావు, పొంగే పంపాపతి తదితరులు హాజరయ్యారు.
Admin
DNB News