DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలోని వెంకటరమణ కాలనీ రైతు బజార్లో “ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్” అనే థీమ్తో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ.భరత్ గుప్త పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ Dr. ఏ. సిరి , నగరపాలక సంస్థ కమిషనర్ చల్ల ఓబులేసు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసిన మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన జ్యూట్ బ్యాగ్లను మంత్రి, కలెక్టర్ ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్” లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Admin
DNB News