DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత ప్రభుత్వం ప్రకటించిన మహాత్మ జ్యోతిరావు పూలే ద్వి శత జయంతి హై లెవెల్ ఉత్సవ కమిటీ లో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ దేశంలోని ప్రముఖుల సరసన చోటు కల్పించడం యావత్ మాదిగ జాతి గర్విస్తుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ ఉత్సవ కమిటీలో మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, 34 మంది కేంద్ర మంత్రులు, 26 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ ఉత్సవాలు రెండు సంవత్సరాల పాటు కొనసాగ నున్నాయి. ఈ కమిటీ ప్రధానమంత్రి అధ్యక్షతన ప్రణాళికలు , విధానాలు ఆమోదం తెలపడం , వాటి అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మహాత్మ జ్యోతిరావు పూలే గారి సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేసే సామాజిక ఉద్యమ కారుడి కేటగిరిలో ఈ స్థానం లభించడం ఎంతో గర్వకారణం. అందుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన, అణగారిన ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము .
Admin
DNB News