Wednesday, 17 June 2026 02:37:39 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

03 జూన్‌ రోజు సైకిల్ ర్యాలీలో అందరం పాల్గొందాం - కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ బాధ్యులు

Date : 02 June 2026 10:46 AM Views : 21

DNB News - ఆంధ్రప్రదేశ్ / : 03 జూన్‌ 2026 రోజు ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ & ఏ. జె. పెడల్స్‌ సంయుక్తంగా నిర్వహించే సైక్లింగ్‌ ర్యాలీలో ఔత్సాహిక సైక్లిస్టులు, సైక్లింగ్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్‌ .వి. నరేందర్ రెడ్డి, అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిలు మరియు ఇతర బాధ్యులు విజ్ఞప్తిచేశారు. ఈ రోజు నగరంలోని వామిలాలపల్లి లో గల అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీ పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడుతూ 03 జూన్‌ రోజున ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌక్‌ నుంచి ఎలగందల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొని పూర్తి చేసిన సైక్లిస్టులకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన అన్ని వయస్సుల వారు ఈ ర్యాలీలో తమ సైకిల్‌లతో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు నిత్యం విధిగా సైక్లింగ్‌ చేయడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం కలుగుతుందని, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ సంక్షోభాల వల్ల చమురు కొరత ఏర్పడడం, చమురు ధరలు పెరగడం వంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తాయని, దీనికి విరుగుడుగా శిలాజ ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ, సైక్లింగ్‌ను ప్రతి ఒక్కరు తమ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు 03 జూన్‌ రోజు ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద సైకిళ్ళతో హాజరు కావాలని కోరారు. ఈ గోడ ప్రతి ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురభి వేణుగోపాల్, కోశాధికారి వి.జగదీశ్వరా చారి, కార్యవర్గ సభ్యులు అఖిల్‌ రెడ్డి, డా: వడ్లూరి శ్రీనివాస్‌, ఎం మహెందర్‌ & తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 9032762247 & 9398230614 నందు సంప్రదించగలరని తెలిపారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :