DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ శ్రీ భగీరథ మహర్షి రాష్ట్ర స్థాయి జయంతోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సునాయన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖతో పాటు వెనుకబడిన తరగతుల సేవా సహాకార సంఘం సంయుక్తంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆది గుడిసె కృష్ణమ్మ, పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కె.ఇ. శ్యాం కుమార్, పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి, కె.డి.సి.ఎం.ఎస్ చైర్మన్ వై. నాగేశ్వర రావు యాదవ్, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ శ్విక్రం సింగ్, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.వి. ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు భగీరథ మహర్షి సేవలను స్మరించుకుంటూ ఆయన సమాజానికి చేసిన కృషిని కొనియాడారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News