DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నిర్వాహించిన ప్రజా దర్బార్లో రిటైర్డ్ హౌసింగ్ జనరల్ మేనేజర్ ఉమాపతి అసహనం వ్యక్తం చేశారు. వెనుకబడిన ఆదోని అభివృద్ధి కోసం కొత్త వ్యక్తిని గెలిపించుకున్న మార్పు లేదని విమర్శించారు. రెండేళ్లు పూర్తవుతున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడీ అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం, రోడ్ల విస్తరణ పనులు నిలిచిపోవడం, ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు ఉండటం వల్ల సమస్య మరింత పెరిగిందన్నారు.
Admin
DNB News