DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేర సమీక్ష సమావేశంలో జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కరరావు ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న బస్సులో రూ.25 లక్షల దొంగతనం జరిగిన కేసులో డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఎస్.జ్యోతి 10 మార్చి 2026న ముద్దాయిలకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. 25.10.2025న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా, 27.10.2025న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షహీద్, సుహేబ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. అనంతరం కోర్టు విచారణలో వారికి శిక్ష విధించబడింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి వెల్దుర్తి సీఐ మధుసూదన్ రావు, ప్రస్తుతం వెల్దుర్తి సీఐ యుగంధర్, క్రిష్ణగిరి ఎస్సై కృష్ణమూర్తిలను కూడా ఎస్పీ అభినందించారు. అదేవిధంగా లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించినందుకు కర్నూల్ త్రీ టౌన్ సీఐ శేషయ్యను, ఒక దొంగతనం కేసులో రికవరీ చేసినందుకు కర్నూల్ నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహను ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Admin
DNB News