Saturday, 18 April 2026 02:22:05 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 65 ఫిర్యాదులు – విచారణ చేసి చట్టపరంగా న్యాయం చేస్తాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్.

Date : 10 March 2026 10:47 AM Views : 72

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా వినిపించి, ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి ఇవి: బెంగుళూరులోని డెలాయిట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పామిడికి చెందిన చింతల సోమశేఖర్ రూ.1 లక్ష తీసుకొని మోసం చేశాడని ఆదోనికి చెందిన నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. గూడూరులో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌ను తన భర్త రమేష్ ఆక్రమించుకోవాలని తన సంతకాలను ఫోర్జరీ చేసి, ఆస్తి మరియు చెక్ బౌన్స్ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నాడని కర్నూలుకు చెందిన రాధిక ఫిర్యాదు చేశారు. కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చిన తనను కళ్ళు సరిగా కనిపించకపోవడాన్ని ఉపయోగించుకుని శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ పత్రాలపై ష్యూరిటీ సంతకాలు చేయించారని, రూ.7 లక్షల లోన్ సమస్యపై సూపర్వైజర్ రఘుబాబు, లలితమ్మ, కిరణ్ పై చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన పబ్బతి నారాయణ ఫిర్యాదు చేశారు. విద్యాంజలి పథకం కింద పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్ రూ.40 లక్షలు తీసుకొని మోసం చేసిందని కర్నూలు బి.క్యాంపుకు చెందిన అహ్మద్ ఉన్నీషా ఫిర్యాదు చేశారు. కర్నూలు రాం ప్రియనగర్‌లో ఉన్న తన ప్లాట్‌ను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారపేటకు చెందిన శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం బాగోలేకపోయినా తన పెద్ద కుమారుడు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన యశోదమ్మ ఫిర్యాదు చేశారు. తన భర్త గుండెపోటుతో మరణించగా, ఆయన పేరుమీద ఉన్న జీవిత భీమా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలానికి చెందిన సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్, సిఐ శివశంకర్ పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :