Saturday, 18 April 2026 02:04:24 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై ఎంహెచ్‌పీఎస్ ఆగ్రహం..

Date : 11 March 2026 02:51 PM Views : 59

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి నిర్లక్ష్యం చూపుతున్నారని సమితి ఆరోపించింది. మహిళా శిశు ఆసుపత్రిలో సోమవారం వందలాది గర్భిణీలు స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి రావడం తీవ్ర ఆందోళన కలిగించిందని తెలిపింది. ఆసుపత్రిలో రద్దీ అధికంగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ పరిస్థితి చూస్తే పేదలుగా పుట్టడమే వారి పాపమా అన్న భావన కలుగుతోందని నూర్ అహ్మద్ విమర్శించింది. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు పూర్తయినా ఆదోని నియోజకవర్గంలో ప్రజలకు సరైన అభివృద్ధి కనిపించడం లేదని సమితి అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో మాత్రమే కార్యకలాపాలు పరిమితమైపోయాయని, పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. అసెంబ్లీలో వంద శాతం హాజరు ఉన్నప్పటికీ ఆదోని పట్టణంలో మాత్రం ప్రజల మధ్య తక్కువగా కనిపిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆదోని నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సమితి డిమాండ్ చేసింది. లేకపోతే ఎమ్మెల్యే నిర్లక్ష్య పాలనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :