DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో వక్ఫ్ మరియు ఎండోమెంట్ భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వక్ఫ్ మరియు దేవాదాయ శాఖలకు చెందిన భూములు ప్రభుత్వానికి విలువైన ఆస్తులని, వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు. ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నచో వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భూముల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News