DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మహిళల సాధికారత, సమాన హక్కులు మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై ప్రత్యేకంగా చర్చించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, వారి ప్రతిభకు మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. అలాగే మహిళలు సమాజానికి శక్తి, ప్రేరణగా నిలుస్తారని, వారి సేవలు దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా విభాగం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళల సేవలను గౌరవిస్తూ వారిని సన్మానించారు.
Admin
DNB News