DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, పెన్షన్లు, గృహాలు, ఉపాధి హామీ, ఆదాయ-కుల ధృవపత్రాలు తదితర అంశాలపై తమ వినతులను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ వేదికను సమర్థంగా వినియోగించుకోవాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశించారు. ప్రతి వినతిపై సమగ్ర విచారణ చేసి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని సూచించారు.
Admin
DNB News