DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇది ఈవెంట్ ల ప్రభుత్వం (రైతు సదస్సు లకు ఖర్చు చేయరు,విద్యా సదస్సు కి ఖర్చు చేయరు, నిరుద్యోగులకు ఖర్చు చేయరు కానీ వృధా ఈవెంట్ లకు కోట్లలో ఖర్చు చేస్తారు.) జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా ఈవెంట్ కోసం ఈ కూటమి ప్రభుత్వం భారీగా ₹300 కోట్లు ఖర్చు చేసింది. DSC-2024 కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే క్రమంలో విజయవాడలో భారీ బహిరంగ సభ/ఈవెంట్ నిర్వహించి సుమారు ₹20 కోట్లు ఖర్చు చేశారు. MLA ఈవెంట్ / నియోజకవర్గ స్థాయి క్రీడలు: కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే క్రీడా పోటీలు లేదా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లకు అయ్యే ఖర్చు సగటున 20 లక్షల నుండి 35 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించారు. సుమారు 175 స్థానాల్లో 60 కోట్లు రూపాయలు ఖర్చు . జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్స్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) మార్షల్ ఆర్ట్స్: మార్షల్ ఆర్ట్స్ క్రీడల ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ₹25 కోట్లు స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంచ్: ఈ డాక్యుమెంట్ విడుదల ఈవెంట్ కోసం కోట్ల లో ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 14, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువజన సర్వీసులు మరియు క్రీడల అభివృద్ధి కోసం అని సుమారు ₹440 కోట్ల రూపాయలు వృథా చేశారు. ఆటవిడుపు (AP Legislators' Sports Meet - 2026). ఫిబ్రవరి 24 - 26, 2026 మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (IGMC), లో ఈవెంట్ లు నిర్వహించి ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఇలా వేల కోట్ల ప్రజా ధనాన్ని ఈవెంట్ లకు ఖర్చు చేసే బదులు వ్యవసాయ రంగానికి లేదా విద్యా రంగానికి లేదా మెడికల్ కళాశాలలకు అభివృద్ధిని వెనక్కు పెట్టీ , ఇస్తానన్న సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ,ప్రజలను మోసం చేస్తూ, ఈవెంట్ రూపం లో ప్రజా ధనాన్ని వొమ్ముచేయడం ఎంత వరకు సమంజసం అని మాజీ వైఎస్సార్ సీపీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల రామారావు (లక్ష్మణ రావు) అన్నారు.
Admin
DNB News