DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రాష్ట్ర రాజధాని అమరావతిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఉద్యోగులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్, పటాకులు కాల్చడం వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిబ్బంది, అధికారులు పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.
Admin
DNB News