Wednesday, 22 April 2026 03:42:37 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

Date : 22 April 2026 11:42 AM Views : 5

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుత్తి పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ నెల 9వ తేదీ రాత్రి గుత్తి పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీప సాయినాథ్ నగర్‌లో ఓ వివాహిత మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అదే రోజు సంతోష్ నగర్‌లో ఓ వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని గొలుసును దోచుకుని పారిపోతుండగా, స్థానికులు స్పందించడంతో నిందితులు మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలను పరిశీలించి, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాల సహాయంతో నిందితులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు మానవ్, హరి ప్రకాష్‌లుగా గుర్తించారు. వారిలో మానవ్‌ను బాలాజీ నగర్‌లో అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసు ముక్కను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులు ముందుగా బెంగుళూరు నుంచి అనంతపురం చేరుకుని, అక్కడ పల్సర్ మోటార్ సైకిల్‌ను దొంగిలించి కర్నూలులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు ఛేదనలో సీఐ విక్రమ్ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ గోపి, పీసీలు మురళి, సుబ్బారాయుడు తదితరులు కీలక పాత్ర పోషించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :