DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్, కౌతాళం మండలం టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చెన్న బసప్ప ధని మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో కర్నూలు జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి పలు ముఖ్య అంశాలపై చర్చించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ప్రోత్సాహం అందిస్తూ, భవిష్యత్ కార్యక్రమాలపై మార్గదర్శకత్వం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, జిల్లాకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు.
Admin
DNB News