DNB News - ఆంధ్రప్రదేశ్ / : ముగ్గురు హోంగార్డులకు హోం గార్డ్స్ కాంట్రిబ్యూషన్ మరియు వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గురువారం అందజేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎఆర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోం గార్డ్స్ కాంట్రిబ్యూషన్ మరియు వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన మొత్తం రూ.4,04,999 విలువైన చెక్కులను ముగ్గురు హోంగార్డులకు అందజేశారు. ఆదోని యూనిట్కు చెందిన హోంగార్డు సయ్యద్ హజరత్ మున్నా పదవీ విరమణ పొందిన సందర్భంగా రూ.2 లక్షల చెక్కును అందజేశారు. కర్నూలు యూనిట్కు చెందిన మహిళా హోంగార్డు రాఘవేంద్రమ్మ మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుమార్తె మౌనికకు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. పత్తికొండ యూనిట్కు చెందిన హోంగార్డు అయూబ్కు మెడికల్ గ్రాంట్ క్రింద రూ.4,999 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ కె.వి.వి.ఎస్.వి. ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి కె. మాధవి రాణి, ఏఆర్ఎస్ఐలు కాంత రెడ్డి, ఎం. మహేశ్వరయ్య, పోలీసు సిబ్బంది మరియు హోంగార్డులు పాల్గొన్నారు.
Admin
DNB News