DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈ నెల 23వ తేదీన యువ నాయకులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కోసిగి పట్టణంలోని శ్రీ యల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యువకుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మన పిల్లల భవిష్యత్తు కోసం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిదారులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నాయకుడికి కృతజ్ఞతగా ఈ రక్తదానం అంకితం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి సోదరులు రామకృష్ణ రెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, మూత్తురెడ్డి, బాసలదొడ్డి ఈరణ్ణ, అడివప్ప గౌడ్, వెంకటపతిరాజు, మాలపల్లి వెంకటేష్, అయ్యన్న, వక్రని వెంకటేష్, సతీష్ నాయుడు, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే తోవి రామకృష్ణ, హరివిలి వీరేష్, విజయ్ కుమార్, ఏశోభు, నరసప్ప, మల్లికార్జున, గాలం వీరేష్, వీరారెడ్డి సహా నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News