Monday, 15 June 2026 02:37:19 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

శ్రీవారి లడ్డూ కల్తీ అంశంపై జనసేన ప్రాయశ్చిత్త దీక్ష – సంఘీభావంగా పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్

Date : 07 February 2026 03:18 PM Views : 143

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస పట్టణంలో పవిత్ర తిరుమలలో శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిట్ రిపోర్ట్ కల్తీ జరిగింది అని నిర్ధారించినప్పటికీ క్షమాపణ చెప్పని గత వైసీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూపై కల్తీ ఆరోపణలు రావడం అత్యంత బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. శ్రీవారి ప్రసాదం పవిత్రతను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని, అలాంటి అంశాల్లో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం క్షమించరాని నేరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి సిట్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, భక్తుల ఆవేదనకు ప్రతీకగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టామని తెలిపారు. శ్రీవారి మహిమకు మచ్చ తెచ్చే ప్రయత్నాలను జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :