DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాజాం పట్టణంలో వినూత్నంగా మోటారు వాహనం పడుకుని పెట్టి పూలమాల వేసి నిరసన చేపట్టిన డా.రాజేష్ తలే ఆధ్వర్యంలో వై యస్ ఆర్ సీపీ శ్రేణులు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే మరియు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి. సూర్యనారాయణ రాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్ మోహన్ రావు మరియు నాలుగు మండలాలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాలు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమెండ్ చేస్తూ వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా రాజేష్ తలే ఆధ్వర్యంలో రాజాం పట్టణంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చినాక తర్వాత ప్రజల నడ్డి విరిచే విధంగా నిత్యవసర సరుకులతో పాటు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు. వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతూ రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News