DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో భాగంగా కోడుమూరు మండలం ఆమడగుంట్ల గ్రామంలో "జలధార - జలహారతి" థీమ్తో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీబీ జీ రామ్ జీ పథకం కింద పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి భూమి పూజ నిర్వహించారు. ఈ పనులు గ్రామీణ జల వనరుల అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కలెక్టర్, ఉపాధి హామీ కూలీలతో కలిసి "స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర" ప్రతిజ్ఞ చేయించి, పరిశుభ్రత, నీటి సంరక్షణ, గ్రామ అభివృద్ధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామం పరిశుభ్రతలో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు
Admin
DNB News