Saturday, 18 April 2026 02:28:31 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

విజయవాడలో అంగన్వాడీల అక్రమ అరెస్టులు ఖండించాలి – కూటమి ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలి: CITU..

Date : 04 March 2026 10:24 AM Views : 49

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంగన్వాడి వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీమా సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టి, టూ టౌన్ సీఐ కి అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. వెంకటమ్మ, రిజ్వానా సర్వోజమ్మతో పాటు CITU అధ్యక్షులు, కార్యదర్శులు పి.ఎస్. గోపాల్, జె. రామాంజనేయులు, తిప్పన్నా వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తెలంగాణ కంటే అధిక వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మార్చి 2న "చలో విజయవాడ" మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అయితే సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దారుణమని ఖండించారు. అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు రూ. 26,000గా వెంటనే పెంచాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ఈపీఎఫ్ మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, అదనపు ప్రభుత్వ యాప్స్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు రిజ్వానా, లలిత, కరుణ, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :