DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యత, సామాజిక న్యాయం కోసం మహాత్మా పూలే చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు నారాయణ, పోతల రాజు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
Admin
DNB News