Saturday, 18 April 2026 02:07:09 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

పార్టీ పునాదులు గ్రామాల్లోనే బలపడాలి.

Date : 21 January 2026 05:25 PM Views : 101

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కమిటీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా జె. కన్వెన్షన్ ప్రాంగణంలో అవగాహన సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్సా సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అతిరధ మహారధులు మాట్లాడుతూ.... ఒక మంచి భవనం నిలవాలంటే బలమైన పునాది ఎంత అవసరమో,అలాగే పార్టీకి గ్రామ స్థాయి కమిటీలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా, సరైన వ్యక్తికి సరైన బాధ్యత అప్పగిస్తూ కమిటీల నియామకాలు జరగాలని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ,వరి పంటకు సంబంధించిన కాలువలు,ఎరువుల కొరత, గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. నియంతృత్వ ధోరణిలో సాగుతున్న పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పార్టీ కార్యక్రమాల్లో ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇలా ఉద్యమాలు చేసేందుకు పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు అదే వ్యవస్థను తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని ఏద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని డబుల్ చేస్తామన్న కూటమి ప్రభుత్వం, ప్రజల సమస్యలను మాత్రమే డబుల్ చేసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చివరికి ప్రజలే అన్ని విషయాలను గమనించి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :