Wednesday, 17 June 2026 04:14:29 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

MRP కి మించి అమ్మకాలు.. ఆదోనిలో తూనికల కొలతల శాఖ మెరుపు దాడులు..

Date : 19 May 2026 10:16 AM Views : 49

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని లంగర్ బాయి వీధిలో సిగరెట్లు మరియు ఇతర వస్తువులను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తూనికల కొలతల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తూనికల కొలతల శాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో రెండు దుకాణాల యజమానులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయిస్తున్నట్లు గుర్తించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని జరిమానాలు విధించారు. అదేవిధంగా ఒక ఫర్టిలైజర్ షాప్‌లో ఎరువుల సంచుల్లో తూకం తక్కువగా ఉన్నట్లు గుర్తించి ఆ దుకాణ యజమానిపై కూడా చర్యలు తీసుకుంటూ జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. వ్యాపారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు సరుకులు విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే దుకాణాలను చట్టపరంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక దాడులు కొనసాగిస్తామని తెలిపారు. తూనికల కొలతల శాఖ దాడుల సమాచారం తెలిసిన వెంటనే అధిక ధరలకు ముఖ్యంగా సిగరెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి పరారైనట్లు సమాచారం.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: