DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని లంగర్ బాయి వీధిలో సిగరెట్లు మరియు ఇతర వస్తువులను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తూనికల కొలతల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తూనికల కొలతల శాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో రెండు దుకాణాల యజమానులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయిస్తున్నట్లు గుర్తించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జరిమానాలు విధించారు. అదేవిధంగా ఒక ఫర్టిలైజర్ షాప్లో ఎరువుల సంచుల్లో తూకం తక్కువగా ఉన్నట్లు గుర్తించి ఆ దుకాణ యజమానిపై కూడా చర్యలు తీసుకుంటూ జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. వ్యాపారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు సరుకులు విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే దుకాణాలను చట్టపరంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక దాడులు కొనసాగిస్తామని తెలిపారు. తూనికల కొలతల శాఖ దాడుల సమాచారం తెలిసిన వెంటనే అధిక ధరలకు ముఖ్యంగా సిగరెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి పరారైనట్లు సమాచారం.
Admin
DNB News