Monday, 15 June 2026 01:42:51 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కర్నూలు జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభం – నేరాల నియంత్రణే లక్ష్యం..

Date : 10 February 2026 05:43 PM Views : 99

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డీజీపీ కార్యాలయం) నుండి జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన మూడు నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. డే విజన్, నైట్ విజన్ సదుపాయాలు కలిగిన ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాశాలలు, పాఠశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచి ఆకతాయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శక్తి టీమ్ బృందాలతో కలిసి కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు బహిరంగ మద్యపానం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ల వినియోగం కీలకంగా ఉంటుందని తెలిపారు. డ్రోన్ల ద్వారా నేరాల నియంత్రణ, చోరీల నివారణ, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అన్నారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా సమర్థవంతమైన నిఘా నిర్వహించేందుకు వీలుంటుందని తెలిపారు. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ సాంకేతికత మరింత దోహదపడుతుందని చెప్పారు. ప్రజల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీస్ శాఖ ముందడుగు వేస్తోందని, సీసీ కెమెరాల వినియోగంతో పాటు డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు గట్టి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసుధన్ రావు, సైబర్ ల్యాబ్ సీఐ మస్తాన్ వలి, ఆర్‌ఐ నారాయణ, సైబర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :