DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని 5వ వార్డు పరిధిలో ఎంఐజి మరియు ఎల్ఐజి కాలనీలలో సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 22, 23 తేదీలలో (బుధ, గురువారం) చేపట్టిన ఈ పనుల్లో భాగంగా ఎంఐజి కాలనీలో 450 మీటర్లు రూ.6 లక్షల వ్యయంతో, ఎల్ఐజి కాలనీలో మరో 450 మీటర్లు రూ.6 లక్షలతో సీసీ డ్రైన్స్ నిర్మించారు. మొత్తం 900 మీటర్ల పనులు రూ.12 లక్షల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. ఈ పనులను కాంట్రాక్టర్ వి.రాజు ఆధ్వర్యంలో, 5వ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ ఎస్. అమర్ ప్రకాష్ సమక్షంలో నిర్వహించారు. కాలనీలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సదుపాయం అమలు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎంఐజి, ఎల్ఐజి కాలనీ ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకుడు శ్రీ కె. మీనాక్షి నాయుడు గారికి, అలాగే మున్సిపాలిటీ మరియు సచివాలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కాలనీలో సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేయడం వల్ల శుభ్రత, మురుగు నీటి పారుదల మెరుగుపడుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టిడిపి 5వ వార్డు ఇన్చార్జ్ ఎస్. అమర్ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
Admin
DNB News