Saturday, 18 April 2026 02:17:15 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

తిరుమల పవిత్రతను కాపాడాలి: దుంపల రామారావు (లక్ష్మణ రావు)

Date : 04 April 2026 05:09 PM Views : 66

DNB News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్‌ నాయుడిని వెంటనే తొలగించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు వైఎస్సార్ సీపీ  శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ  దాస్ మరియు ధర్మాన రామ్మనోహర్నాయుడు ఆధ్వర్యంలో  శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ,నిరసన కార్యక్రమాలు చేపట్టారు.    భక్తి ముసుగులో రాజకీయాలా? "హిందువుల అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమలపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం వేంకటేశ్వర స్వామిని వాడుకోవడం దారుణం. పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారే అపవిత్రం చేస్తున్నారు" . తిరుమల పవిత్రత  విషయంలో చంద్రబాబు చేస్తున్న ద్రోహం  అంతా ఇంతా కాదు.  ఉద్దేశపూర్వకంగానే  తిరుమల పవిత్రతను  మంగగలిపేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఒక  నీచుడునీ  వెంటపెట్టుకొని  తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు  ఆలయ పవిత్రత  గురించి మాట్లాడటం దెయ్యాలు  వేదాలు వళ్లించినట్లయింది. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన  క్షేత్రం  పాలక మండలి చైర్మన్  గా ఉండి పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీ ఆర్ నాయుడును చంద్రబాబు కాపాడటం హేయం.    ఎన్ని విమర్శలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా కళంకితుడైన బీ ఆర్ నాయుడును చంద్రబాబు వెనకేసుకురావడం అత్యంత దారుణం.    బీ ఆర్ నాయుడు విడియోలు  వైరల్ అయిన,ఇన్ని రోజులు గడిచినా ఆయనపై చర్య  తీసుకోవడం లో మీనమేషాలు లెక్కిస్తున్నారు. పైగా తిరుమలలో యదేచ్ఛగా దైవిక కార్యక్రమాల్లో  పాల్గొంటూ అపాచారాలకు పాల్పడుతున్నారు.   బీ ఆర్ నాయుడు నీ వెంటపెట్టుకొని  మరీ  దేవుడిని  దర్చించుకోవడం ,ఆ తరువాత కూడా అనేక కార్యక్రమాలు  బీ ఆర్ నాయుడు సమక్షం లో  చేయడం, ఇవన్నీ చూసిన తరువాత తిరుమల పవిత్రత కోసం ఆరాటపడుతున్న  ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు  తీరు చూసి తీవ్రంగా గా మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి వంటి పుణ్యక్షేత్రంపై రాజకీయ ముద్ర వేయడం సరికాదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్‌ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) ఇచ్చాపురం దుంపల రామారావు (లక్ష్మణ రావు),పిన్నింటి సాయి కుమార్, అంబటి శ్రీనివాస రావు, ఎచ్చెర్ల శ్రీధర్ఎ,న్ని ధనుంజయ రావు, కరిమి రాజేశ్వరరావు,రాజపు అప్పన్న,  అందవరపు సూరిబాబు,మామిడి శ్రీకాంత్, ఆరంగి మురళి తదితర నాయకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :