Saturday, 18 April 2026 03:10:00 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

“మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు..

Date : 16 April 2026 06:16 PM Views : 11

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా... మహిళలపై నేరాల నివారణకు అవగాహన కల్పించేందుకు “మీ రక్షణ – మా బాధ్యత” పేరుతో కర్నూలు మెడికల్ కళాశాల ఆడిటోరియంలో గురువారం అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. సమస్యల విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలు తగ్గుతాయని అన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలు, పట్టణాలు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మహిళలతో పాటు యువతకు కూడా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి కార్యకలాపాలపై నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డా. శ్రీరాములు మాట్లాడుతూ అత్యవసర సమయంలో శక్తి యాప్ వినియోగించుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రిటైర్డ్ ఐసీడీఎస్ అధికారి జుబేదా బేగం మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మంచి విలువలు నేర్పించాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ గారు మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, డాక్టర్లను శాలువా, మెమొంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, వైస్ ప్రిన్సిపల్స్ డా. శ్రీరాములు, డా. సింధియా శుభప్రద, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డా. మాధవి శ్యామల, ఐసీడీఎస్ నుండి అనురాధ, అడ్వకేట్ నాగలక్ష్మి, సీఐలు మధుసూదన్ రావు, రామయ్య నాయుడు, శేషయ్య, శివశంకర్, విక్రమ సింహ, మన్సురుద్దీన్, మారుతి శంకర్, శ్రీధర్ మరియు మహిళా శక్తి టీం పోలీసులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :