DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇది కేవలం ఒక పార్టీ జెండా కాదు, కోట్లాది మంది ప్రజలు తమ భుజాలెత్తి మోస్తున్న ఎజెండా. అన్యాయాలను ఎదుర్కుంటూ .. కుట్రలను తట్టుకుంటూ ప్రజా నమ్మకం - ప్రజా బలంతో ఎదిగిన పార్టీ . దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం , ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా, రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకన్న సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నవభారత్ జంక్షన్ వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) , రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాల ప్రయాణంలో వైసిపి పార్టీ అనేక పోరాటాలు ,విజయాలను సాధించిందన్నారు. పార్టీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంతో పోరాటాల మధ్య పుట్టిన ఈ పార్టీ ప్రజల ఆశీర్వాదంతోనే ఎదిగిందన్నారు. పేద ప్రజలు , రైతులు , బడుగు ,బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వైసీపీ పార్టీ పనిచేస్తుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన సంక్షేమ పాలనను కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. గత 16 సంవత్సరాల పార్టీ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆరంభం నుండి రాజకీయ ఒత్తిడులు , రాజకీయ అవరోధాలు , కక్ష సాధింపులని ఎదుర్కొని వైసిపి పార్టీ ప్రజా మద్దతుతో బలపడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన ప్రజల మనసుల్లో వైసిపి పార్టీ పట్ల విశ్వాసాన్ని తొలగించలేరని హితువు పలికారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రామారావు పిలుపునిచ్చారు.....
Admin
DNB News