Saturday, 18 April 2026 02:54:14 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

పోరాటమే పునాది.. ప్రజా సంక్షేమమే ధ్యేయం! పోరాటం నుంచి పుట్టిన శక్తి!

Date : 12 March 2026 03:04 PM Views : 117

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇది కేవలం ఒక పార్టీ జెండా కాదు, కోట్లాది మంది ప్రజలు తమ భుజాలెత్తి మోస్తున్న ఎజెండా. అన్యాయాలను ఎదుర్కుంటూ .. కుట్రలను తట్టుకుంటూ ప్రజా నమ్మకం - ప్రజా బలంతో ఎదిగిన పార్టీ . దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం , ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా, రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకన్న సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నవభారత్ జంక్షన్ వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) , రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాల ప్రయాణంలో వైసిపి పార్టీ అనేక పోరాటాలు ,విజయాలను సాధించిందన్నారు. పార్టీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంతో పోరాటాల మధ్య పుట్టిన ఈ పార్టీ ప్రజల ఆశీర్వాదంతోనే ఎదిగిందన్నారు. పేద ప్రజలు , రైతులు , బడుగు ,బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వైసీపీ పార్టీ పనిచేస్తుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన సంక్షేమ పాలనను కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. గత 16 సంవత్సరాల పార్టీ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆరంభం నుండి రాజకీయ ఒత్తిడులు , రాజకీయ అవరోధాలు , కక్ష సాధింపులని ఎదుర్కొని వైసిపి పార్టీ ప్రజా మద్దతుతో బలపడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన ప్రజల మనసుల్లో వైసిపి పార్టీ పట్ల విశ్వాసాన్ని తొలగించలేరని హితువు పలికారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రామారావు పిలుపునిచ్చారు.....

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :