DNB News - ఆంధ్రప్రదేశ్ / : సుకలపేట గ్రామ రోడ్ కి 73 లక్షలు, గొల్లపేట గ్రామానికి 39 లక్షలు (AIIB) నిధులతో నిర్మించిన బీటీ రోడ్డు ఈ రోజు ఘనంగా ప్రారంభిoచారు ఆమదాలవలస మండలం తొగరం పంచాయతీ పరిధిలోని ఇసుకలకపేట గ్రామం, నెలిపర్తి పంచాయతీకి చెందిన గొల్లపేట గ్రామ ప్రజలకు ఎట్టకేలకు చిరకాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ గౌరవనీయులు శ్రీ కూన రవికుమార్ ఇచ్చిన హామీని అక్షరాలా నిలబెట్టుకుంటూ, ఆయా గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ రోజు ప్రారంభించారు. ఈ రోడ్ల నిర్మాణానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ తమ్మినేని చంద్రశేఖర్ గారి సహకారం అందడంతో పనులు వేగంగా జరిగాయి ఏళ్ల తరబడి సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడిన ఇసుకలకపేట, గొల్లపేట గ్రామ ప్రజలకు ఇది ఒక చిరకాల స్వప్నం నెరవేరిన సందర్భంగా నిలిచింది. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు, అత్యవసర అవసరాల సమయంలో ఎదురైన సమస్యలకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మాటలకే పరిమితం కాకుండా చేతలతో అభివృద్ధిని చూపిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో ఈ కార్యక్రమం మరోసారి స్పష్టంగా నిరూపించింది. “ఇది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం” అని చాటిచెప్పిన కూటమి ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులు ,కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు .
Admin
DNB News