Tuesday, 28 April 2026 02:58:45 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

ప్రైవేట్ స్కూల్స్ అక్రమాలకు అండగా ఉన్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలి – ఎస్‌ఎఫ్ఐ డిమాండ్...

Date : 23 April 2026 05:11 PM Views : 22

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్న డిప్యూటీ డీఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ—పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తమ పాఠశాలలో చేర్పించాలని ఒత్తిడి తెస్తూ, పుస్తకాలు, టై, బెల్ట్ పేర్లతో తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ డీఈఓ తన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ అనేకమంది కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. డిప్యూటీ డీఈఓ తన నివాసాన్ని కార్యాలయంగా మార్చుకుని అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఏ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయాలన్నా సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి, సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :